యావత్సస్థో హ్యయం దేహో
యావన్మృత్యుశ్ఛ దూరతః
తావదాత్మహితం కుర్యాత్
ప్రాణాన్తే కిం కరిష్యతి॥
ఈ శరీరం ఎంతకాలం రోగం లేనిదై స్వాస్థ్యము కలిగి ఉండునో, అంతవరకు తనకు మేలు కలిగించే శుభకర్మలను, పుణ్యకర్మలను చేయవలెను. అనారోగ్యం పాలైన తర్వాత ఏమీ చేయలేం. తనకు గానీ, ఇతరులకు గానీ మేలు చేసే కార్యాలు ఆరోగ్యంతో ఉన్నప్పుడే చేయ సంకల్పించాలి. మరణించిన తర్వాత ఎవరు ఏమి చేయగలరు!?