శరన్నవరాత్రులకు ముందు వచ్చే అమావాస్యను ‘మహాలయ అమావాస్య’ అంటారు. మన ఈనాటి జీవితానికి పలువిధాలుగా దోహదపడిన మునుపటి తరాల పట్ల కృతజ్ఞతా భావాన్ని వెలిబుచ్చేందుకు, శ్రద్ధాంజలి సమర్పించేందుకు అంకితమిచ్చిన ప్రత్యేక దినం ఇది. మరణించిన పూర్వీకులకు తర్పణ, తిలోదకా లు ఇచ్చి శ్రద్ధాంజలి ఘటించేందుకు నిర్దేశించిన రోజు ఇది.
ఎవరైనా చనిపోయినప్పుడు, మరణించిన వ్యక్తికి కుటుంబసభ్యులు కర్మకాండ లు చేయడం మన సంస్కృతిలో భాగం. కానీ, దురదృష్టవశాత్తూ, ప్రస్తుత కాలంలో ఈ తతంగమంతా పూర్తి వాణిజ్యంగా మారింది. ఒక వ్యక్తి చనిపోతే, వారు ఇక లేరని అనుకుంటాం. కానీ, ఆ వ్యక్తికి సంబంధించినంత వరకు, అతను కేవలం తన దేహాన్ని, జీవితాన్ని కోల్పోతాడు. దేహాన్ని పోగొట్టుకుంటా డు కానీ, ఉనికి మిగిలే ఉంటుంది. వ్యక్తి జ్ఞాపకాలు, పాపపుణ్యాలే అతని ఉనికిని తెలియజేస్తాయి. అయితే, వారికి జరిపే ఉత్తర క్రియలు ఆ ఉనికిని తుడిచిపెట్టేయకూడదు. మరణించిన వ్యక్తి సంతోషాన్ని రెట్టింపు చేసేవిగా ఉండాలి. కానీ, ఇంట్లో ఒక వ్యక్తి పోయిన బాధలో కుటుంబసభ్యులు చాలామంది ఆలోచన కోల్పోతారు. మనసులో గూడుకట్టుకున్న విచారం విస్తారం అవుతుంది. మరణించడానికి ముందు ఆ వ్యక్తిలో ఏ ప్రవృత్తులు ఉన్నాయో, అవి విస్తారమవుతాయి. చనిపోయిన తర్వాత అత్యంత విచారకర మైన స్థితిలోకి పతనం చెందితే, అదే నరకం. అందుకే ఆనందమయ స్థితిలోకి వెళ్లగలిగితే అప్పుడు అది స్వర్గం అవుతుంది.
ఎవరైనా చనిపోతున్నప్పుడు, ఆ వ్యక్తి చెవిలో నారాయణ మంత్రమో, రామ నామమో చెప్పడం మనం గమనిస్తుంటాం. తులసి తీర్థం ఇవ్వడాన్నీ చూస్తుం టాం. ఆ మంత్రం మరణిస్తున్న వారిలో ఒక రకమైన సంతోషం కలిగిస్తుందనే ఉద్దేశంతో అలా చెబుతుంటారు. ఆ శబ్దాలు ఆ వ్యక్తిలో ఆనంద ప్రకంపనలు కలిగిస్తాయన్న నమ్మకంతో అలా చెబుతారు. మంత్రాలను పఠిస్తూ, వింటూ ఆ వ్యక్తి ఆనందంగా కన్నుమూస్తాడన్న విశ్వాసంతో మన పెద్దలు ఈ విధానాన్ని అనుసరించారు.
అవసాన దశలో మరణాన్ని కూడా ప్రేమగా, భక్తితో ఆహ్వానించగలిగే గొప్ప సంస్కృతి ఒక్క భారతదేశంలోనే చూస్తాం. తమ మరణం మహోన్నతమైన ప్రదేశంలో జరగాలని కోరుకుంటారు చాలామంది. దీని కోసం ఆధ్యాత్మికంగా అనుకూలమైన, సచేతనమైన ప్రదేశాన్ని ఎంచుకుంటారు. అక్కడ వీలైనంత హుందాగా శరీరాన్ని త్యాగం చేయాలని భావిస్తారు. అందుకే, మన దేశంలో చాలామంది ముసలివాళ్లు కాశీలో మరణించాలని కోరుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య కాకుండా పవిత్ర కాశీ నగరంలో ఒంటరిగా చనిపోవాలని తపిస్తుంటారు. అందుకు తగ్గట్టుగా అవసాన దశ రాగానే కాశీపురికి వెళ్లిపోతా రు. ఎందుకంటే, కుటుంబం మధ్య మృత్యువును సాదరంగా ఆహ్వానించలేరు. కుటుంబసభ్యులను అనురాగంతో చూస్తూ.. సులువుగా దేహాన్ని విడవలేక యాతన అనుభవిస్తారు. ఆ విచారంతో కన్నుమూస్తే.. అదే పెద్దదై ఆ మరణించి న వ్యక్తిని పట్టిపీడిస్తుంది. అందుకే, మరణానికి వెరవకుండా కాశీలాంటి పుణ్య స్థలాలకు వెళ్లాలని నిర్ణయించుకుంటారు. మరణం గురించి నిర్దుష్టమైన అవగా హన, జ్ఞానం ఉన్నవాళ్లు మాత్రమే ఇలాంటి మార్గాన్ని ఎంచుకోగలరు.
మరణించిన వ్యక్తిని తలచుకొని బాధపడటం అతి సహజం. వారికి ఉత్తమ గతులు కలగజేయడానికి రకరకాల వైదిక క్రతువులు నిర్వహిస్తుంటారు. ఆ మరణించిన వ్యక్తుల పేరిట యథాశక్తి దానధర్మాలు చేస్తుంటారు. వారి జ్ఞాపకా లను తలుచుకొని బాధపడకుండా.. వారి ఆశయాలను నెరవేర్చేందుకు కృషి చేయాలి. ఈ క్రమంలో పోయిన వ్యక్తులను మరోసారి తలుచుకొని వారి పేరిట ధార్మిక కార్యక్రమాలు నిర్వహించే అద్భుతమైన రోజు మహాలయ అమావాస్య. ఈ రోజు వారి పేరిట తర్పణాలు విడిచి, నలుగురు అన్నార్తులకు యథాశక్తి దానం చేయగలిగితే పితరుల (పెద్దల) రుణం తీర్చుకున్నవాళ్లం అవుతాం. ఈ లోకంలో వారి పేరుతో నిండు మనసుతో మనం చేసే చిన్నపనైనా.. ఊర్ధలోకాల్లో ఉన్న మనవారికి నిస్సందేహంగా అంతులేని సంతోషాన్ని, సంతృప్తిని కలగజేస్తుంది.
ప్రేమాశీస్సులతో సద్గురు ఈషా ఫౌండేషన్