ఆర్బిట్రేషన్ అంటే మధ్యవర్తిత్వం. కేసులను కోర్టుల్లో కాకుండా కోర్టు బయట ఇరుపక్షాలు ఆమోదయోగ్యంగా రాజీ చేసుకోవడమే ఆర్బిట్రేషన్. ఇందుకు మధ్యవర్తులుంటారు. ఇరుపక్షాలు తమకు సమ్మతమైన వారిని ఆర్బిట్రేటర్గా నియమించుకోవచ్చు. ఆర్బిట్రేటర్లుగా విశ్రాంత న్యాయమూర్తులు, వివిధ రంగాల్లోని ప్రముఖులు ఉంటారు. వీరి సమక్షంలో ఇరుపక్షాలు కేసును రాజీ చేసుకుంటే దానిపై అప్పీల్ చేసుకునే అవకాశం ఉండదు. అంటే సుప్రీం తీర్పుతో సమానం.
ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటైతే కార్పొరేట్/ వాణిజ్యసంస్థల్లో ఏర్పడే వివాదాలు ఉభయపక్షాలు రాజీ చేసుకుంటాయి. హైదరాబాద్లో ఏర్పాటయ్యేది అంతర్జాతీయస్థాయిలో ఆరో సెంటర్ కాబోతున్నది. తొలిసారి 1926లో ప్యారిస్లో ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటైంది. తర్వాత లండన్, సింగపూర్, హాంకాంగ్, జెనీవాల్లో కూడా ఏర్పాటయ్యాయి. వీటిలో హాంకాంగ్, సింగపూర్ సెంటర్లలో కేసులను రాజీ చేసుకునేందుకు బహుళజాతి సంస్థలు ఆసక్తి చూపుతాయి. కేసులను రాజీ చేసేటప్పుడు రాగద్వేషాలకతీతంగా, సత్వరమే పరిషరించేందుకు ఆ రెండు సెంటర్లు ఎకువ శ్రద్ధ చూపుతున్నాయనే పేరుందని న్యాయ నిపుణులు చెప్తారు. ఆర్బిట్రేషన్ చేసే ప్యానల్లోని సభ్యులను ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్ కింద నియమిస్తారు. ముగ్గురు సభ్యుల ప్యానల్లో అంతర్జాతీయంగా ఆర్బిట్రేషన్లో ప్రముఖులు, మాజీ న్యాయమూర్తులు, వివిధ రంగాల్లోని సుదీర్ఘ అనుభవం ఉన్న నిపుణులుంటారు. హైదరాబాద్లో త్వరలోనే ఏర్పాటయ్యే మీడియేషన్, ఆర్బిట్రేషన్, కన్సిలేషన్లు పారిశ్రామిక, వాణిజ్య రంగాల వివాదాలనే కాకుండా డొమెస్టిక్ ఆర్బిట్రేషన్, స్థానికంగా పెట్టుబడులు పెట్టేవారికి మధ్య వివాదాలను సైతం పరిషరిస్తుందని కీలకాంశంగా చెప్పుకోవచ్చు. వాస్తవానికి మధ్య వర్తిత్వం ద్వారా ఇరుపక్షాలు కేసులను రాజీ చేసుకునే విధానాన్ని చట్టబద్ధంగా మాజీ ప్రధాని పీవీ హయాంలో 1996లో ఆచరణలోకి తీసుకొచ్చారు. సరళీకృత ఆర్థిక విధానాలు అమలుచేయాలనే సంసరణల్లో భాగంగా విదేశీ పెట్టుబడులను రాబట్టే క్రమంలో చట్ట సవరణ చేశారు. ఆ చట్టంలోని లొసుగులపై శ్రీకృష్ణ కమిటీ అధ్యయనం చేసి నివేదిక సమర్పించిన తర్వాత 2019లో మరోసారి చట్టసవరణ జరిగింది.
న్యాయ సేవాధికార సంస్థల్లోనూ..దేశస్థాయిలో సుప్రీం కోర్టులో న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర స్థాయిలో హైకోర్టుల్లో, కిందిస్థాయి అన్ని కోర్టుల్లో న్యాయ సేవాధికార సంస్థలు ఉభయ
పక్షాల కేసులను రాజీచేసే విధానం ఆచరణలో మంచి ఫలితాలిస్తున్నది. కేసులను రాజీ చేసుకోవాలని ఆయా కోర్టులు ఇచ్చిన సలహాలను ఆమోదించి సంబంధిత కోర్టుల్లో జడ్జిల సమక్షంలో పరిషరించుకున్న కేసులు కోకొల్లలు. న్యాయ సేవాధికార సంస్థల్లో కేసులను రాజీ చేసుకుంటే వాటిపై అప్పీల్ చేసుకునే ఆసారం వాదప్రతివాదులకు ఉండదు.
వాస్తవానికి మధ్యవర్తిత్వ విధానం భారతీయ కుటుంబవ్యవస్థలో ఉన్నది. ఇంట్లో పిల్లల మధ్య ఎలాంటి వివాదాలు తలెత్తినా కుటుంబపెద్దలు కూర్చోబెట్టి రాజీ చేసేవారు. ఈ క్రమంలో గ్రామాల్లో కుల సంఘాలు, వాళ్ల కులసభ్యుల మధ్య వివాదాలు ఏర్పడితే కుల పెద్దలు రాజీ చేసేవారు. గ్రామాల్లో రచ్చబండల వద్ద గ్రామపెద్దలు గ్రామ ప్రజల సమస్యలను రాజీ విధానంలో అంటే నేటి మధ్యవర్తిత్వ విధానంలో పరిషరించేవారు. ఈ విధానం ఎన్నో ఏండ్లుగా అమల్లో ఉండేది. ఒక అధ్యయనం ప్రకారం మండల వ్యవస్థ తర్వాత పోలీస్స్టేషన్లు కూడా మండలస్థాయిలో ఏర్పాటుచేయడంతో గ్రామ, కుల పెద్దల తీర్పులకు కాలం చెల్లింది. ప్రతి సమస్యకు పోలీస్స్టేషన్లల్లో కేసులు పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఇటీవలి కాలంలో రాజీ మార్గంలో పరిషారానికి గ్రామీణులు సైతం ఆసక్తి చూపుతున్నారు. నాటి మన సంప్రదాయంలో భాగంగా ఉన్న గ్రామ పంచాయతీలే ఇప్పుడు కోర్టుల్లో చట్టబద్ధంగా న్యాయ సేవాధికారసంస్థలు, అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ సెంటర్ల ద్వారా కేసులను రాజీ చేయడం ద్వారా పరిషారానికి తెరలేచింది.
హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పడితే ఎన్నో లాభాలుంటాయి. ఈ సెంటర్లో బహుళజాతి సంస్థలు తమ కేసును రాజీ చేసుకునేందుకే ఎకువ ఆసక్తి చూపే ఆసారం ఉంటుంది. హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుతోపాటు, సమీపంలోనే స్టార్ హోటళ్లు కూడా ఉన్నాయి. ఆయా దేశాల ఆహారాన్ని సరఫరా చేసేవారు కూడా ఉన్నారు. అంతర్జాతీయంగా పోలిస్తే చాలా తకువగా ధరలుంటాయి. దీంతో హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్కు వచ్చే విదేశీ కేసులు ఎకువగా ఉంటాయి. విదేశీ కరెన్సీ మారకాన్ని లెకిస్తే కూడా ఆర్థికంగా బహుళజాతి సంస్థలు హైదరాబాద్నే ఎంచుకునే అవకాశాలుంటాయి. ఇలా వస్తే ఇకడి వ్యాపారాలు పెరుగుతాయి. దీనికితోడు హైదరాబాద్ వాతావరణం కూడా అందరినీ బాగా ఆకట్టుకొని ఆయా సంస్థలు హైదరాబాద్లోనే పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువస్తాయని న్యాయనిపుణులు చెప్తున్నారు. యావత్దేశమే కాకుండా అనేక దేశాల నుంచి వచ్చేవారితో హైదరాబాద్ స్థాయి మరింత ఉన్నతస్థితికి చేరుతుందని పారిశ్రామికవర్గాలు సైతం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి.