‘సోనూసూద్’.. ఈ పేరు వినగానే ఎవరికైనా కరోనా కాలంలో వలస కార్మికులకు ఆయన అందించిన సాయం గుర్తుకువస్తుంది. సినిమాల్లో ప్రతినాయకుడి పాత్రలు పోషించినా, నిజ జీవితంలో మాత్రం నాయకుడనిపించుకుంటున్నారు.
సోనూసూద్ సుమారు రూ.20 కోట్ల పన్ను ఎగవేశారనే ఆరోపణలు చేస్తూ ఆయనపై అకస్మాత్తుగా ఆదాయ పన్ను శాఖ దాడులు నిర్వహించింది. అయి తే ఇవి క్షక్షసాధింపు దాడులే అనే విమర్శ వినిపిస్తున్న ది. కష్టాల్లో ఉన్న ప్రజలకు సాయం చేస్తే దాడులు చేస్తారా అని ప్రశ్న తలెత్తుతున్నది.
కరోనా వ్యాపిస్తున్న కొత్తలో కనీస సమాచారం ఇవ్వకుండా కేంద్రం అకస్మాత్తుగా లాక్డౌన్ ప్రకటించింది. దీంతో దేశంలో జనజీవనం ఎక్కడికక్కడ స్తం భించిపోయింది. వలస కార్మికులను లాక్డౌన్ తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. దేశంలో సుమారు 11 కోట్ల వలస కార్మికులు ఉంటారని పలు గణాంకాలు చెప్తున్నాయి. అయితే వీళ్లకు లాక్డౌన్ ఎప్పుడు ముగుస్తుందో తెలియక ఆకలితో అలమటించిపో యారు. విధిలేని పరిస్థి తిలో, బతుకుదామనే ఆశతో కాలినడకన సొంతూళ్లకు బయల్దేరారు. వేల కిలోమీ టర్లు నడుస్తున్న వీళ్లను చూసి చలించని హృదయం లేదు. ఆ సమయంలో ‘నేనున్నానంటూ’ భరోసాని స్తూ సోనూసూద్ తన సొంత ఖర్చుతో విమానాలు, రైళ్లు, బస్సుల్లో వలస కార్మికులను వారి సొంతూళ్లకు సురక్షితంగా చేర్చారు.
వలస కార్మికులు తమ ఊళ్లకు వెళ్లే క్రమంలో ఎంతోమంది ఆకలికి అలమటించి మార్గమధ్యలో మరణించారు కూడా. వలస కార్మికులను చూస్తూ ఉండిపోయిన కేంద్ర ప్రభుత్వం వారిని ఆదుకోలేదు. కనీసం అన్నపానీయాలు కూడా అందించలేదు. కేంద్రప్రభుత్వం చేయని పని హీరో సోనూసూద్ చేశారు. వలస కార్మికులకు అన్నం పెట్టారు. ఆక్సిజన్ అవసరమైన చోట ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. దేశ ప్రజలను భయకంపితులను చేసిన కరోనా కాలంలో సోనూసూద్ ప్రాణదాతగా నిలిచార నడంలో సందేహం లేదు.
పెద్ద పెద్ద కంపెనీలున్న అపర కుబేరులు సైతం వల స కార్మికులకు కనీస సాయం చేయలేక చేతులు దులు పుకొన్నారు. తమ జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేశామని ప్రగల్భాలు పలికే పలువురు రాజకీయ నాయకులు ప్రతినాయకులైన వేళ సోనూసూద్ నాయకుడై నిలిచారు. ఇంతటి మానవత్వం ఉన్న వ్యక్తిని అభినందించాల్సింది పోయి ఐటీదాడుల పేర అవమానించడం తగదు.
ఆదాయపు పన్ను శాఖ దాడులకు కారణం సోనూసూద్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతున్నట్లు కథనాలు రావడమేనని విమర్శలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తమపై రాజకీయ విమర్శలు చేసిన వారిపై దేశద్రోహం కేసులు పెట్టిన ఉదంతాలున్నాయి. ఆ కోవలోనే సోనూసూద్పై కూడా దాడులు సాగుతు న్నాయనుకోవచ్చు. ‘అచ్ఛే దిన్ ఆయేగీ’ అని చెప్పిన బీజేపీ అన్నింటా విఫలమైంది.
బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ ఏడేండ్ల పాలనలో చేసిందేమీ లేదు. నోట్ల రద్దు పేరిట యావత్ దేశం నడ్డి విరిచింది. నల్లధనం వెనక్కి తెస్తా మని చెప్పి ప్రజల్ని నట్టేట ముంచింది. ఇకనైనా బీజేపీ పాలకుల తీరు మారాలి. తనను తప్పుబట్టే వ్యక్తుల మీద కాకుండా వారు చేస్తున్న విమర్శలను పరిశీలిం చి దేశాభివృద్ధి దృష్టిపెట్టాలి.
(వ్యాసకర్త: జర్నలిజం, న్యాయశాస్త్ర విద్యార్థి)
–బొమ్మరగొని కిరణ్