అయం నిజః పరోవేతి
గణనా లఘు చేతసాం
ఉదార చరితానాంతు
వసుధైవ కుటుంబకం
ఇతడు నావాడు, ఇతడు పరుడు అనే భావన అల్పబుద్ధి కలవారికి మాత్రమే ఉంటుంది. ఉన్నతమైన నడవడి గలవారికి మాత్రం ఈ భూమండలమంతా ఒక కుటుంబమైతే, భూమి మీద నివసించే ప్రజలంతా ఆ కుటుంబ సభ్యులు. ఎక్కడ, ఎవరికి అన్యాయం జరిగినా వారి హక్కుల కోసం పోరాడుతారు. ‘సర్వే జనాస్సుఖినోభవంతు, లోకాస్సమస్తా స్సుఖినో భవంతు’ అనే విశ్వ జనీనమైన భారతీయ భావనతో ప్రజాసేవ చేసిన వారెందరో ఉన్నారు. మహాత్ముడిగా ప్రసిద్ధి చెందిన గాంధీ దక్షిణాఫ్రికాలో నల్లజాతి వారి హక్కుల కోసం పోరాటం చేయడం ఒక ప్రత్యక్ష సాక్ష్యం.