బొడ్రాయిబజార్, జూన్ 22 : సూర్యాపేటను సుందరమైన పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ అన్నారు. 42వ వార్డులో రూ.15లక్షలతో చేపట్టిన డ్రైనేజీ నిర్మాణ పనులకు మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంత్రి జగదీశ్రెడ్డి సహకారంతో రూ.33కోట్లతో అన్ని వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు. 42వ వార్డులో గతంలో ఉన్న మంచినీటి సమస్యను పరిష్కరించామన్నారు. వార్డుల్లో ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పట్టణాభివృద్ధ్దిలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పి.రామానుజులరెడ్డి, వార్డు కౌన్సిలర్ అంగిరేకుల రాజశ్రీ, డీఈ సత్యారావు, శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు నాగార్జున, అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆదర్శ యూత్ సభ్యులు పాల్గొన్నారు.