కరోనా సెకండ్ వేవ్ వలన చాలా మంది మృత్యువాత పడుతున్నారు. ఈ సమయంలో ఒకరికొకరం సాయంగా ఉండాలి అంటూ సెలబ్రిటీలు ప్రజలలో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున ప్రాణాల కోసం పోరాడుతున్న వారికి ప్లాస్మా దానం చేయాలని తమ సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. చిరంజీవి తన ట్వీట్లో సెకండ్ వేవ్ లో కరోనా బాధితులు మరింతగా పెరుగుతుండడం మనం చూస్తున్నాం. వారిని ఆదుకునేందుకు మీరు ముందుకు రావలసిన సమయం ఇది. కరోనా నుండి కొద్ది రోజుల ముందే కోలుకున్నట్టు అయితే, ప్లాస్మాని డొనేట్ చేయండి. దీని వలన ఇంకో నలుగురు, కరోనా నుండి త్వరగా కోలుకోవడానికి సహాయపడిన వారవుతారు. నా అభిమానులు కూడా ప్రత్యేకించి ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను అని చిరంజీవి తన ట్వీట్లో పేర్కొన్నారు.
అక్కినేని నాగార్జున కూడా ఇటీవల కరోనా నుండి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేసి పలువురి ప్రాణాలు కాపాడలని కోరుతున్నారు. 18-60 సంవత్సరాల వయస్సు ఉన్న వారు ఎవరైన సరే ప్లాస్మా దానం చేయోచ్చంటూ నాగ్ పేర్కొన్నారు.