న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఇప్పుడిప్పుడే తగ్గుతున్నది. మరోవైపు త్వరలోనే థర్డ్ వేవ్ కూడా విజృంభించనుందనే వార్తలు వినిపిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. దేశంలో ఆక్సిజన్ నిలువల అభివృద్ధి, లభ్యతపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం ఇంకా కొనసాగుతున్నది.
కరోనా సెకండ్ ప్రారంభంలో దేశంలో తీవ్ర ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఏప్రిల్ చివరి రెండు వారాలు, మే మొదటి రెండు వారాలు కేసుల సంఖ్య బాగా పెరిగిపోవడంతో అన్ని ఆస్పత్రుల్లో మెడికల్ ఆక్సిజన్ నిలువలు నిండుకుని జనం పెద్ద సంఖ్యలో మృతిచెందారు. కాగా, ప్రధాని మోదీ గత నెల 26న కూడా ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశంలో కరోనా వైరస్ పరిస్థితి, వాక్సినేషవన్లో పురోగతిపై ఆ సమావేశం ప్రధానంగా చర్చించారు. ఆ వారంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకోవడంపై ఆయన సంతృప్తి వ్యక్తంచేశారు.