హైదరాబాద్: నగరంలోని ఎర్రగడ్డ పరిధి రాజీవ్నగర్లో గోడ కూలి ఓ విద్యార్థి మృతిచెందాడు. నిన్న నగరంలో కురిసిన భారీ వర్షానికి అపార్ట్మెంట్ ప్రహరీ గోడ ఆకస్మాత్తుగా కూలింది. కాగా ఈ ప్రహరీ గోడ శిథిలాల కింద చిక్కుకుని ఆశీష్ అనే విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. ప్రహరీ గోడ కింద విద్యార్థి పడిపోయినట్లు స్థానికులు గమనించలేదు. జేసీబీతో గోడ శిథిలాలు తొలగిస్తుండగా విద్యార్థి మృతదేహం లభించింది. అశీష్ నిన్న స్నేహితుడిని కలిసేందుకు అతని అపార్ట్మెంట్కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.