అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఏర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయిక. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడిన షూటింగ్ను మంగళవారం హైదరాబాద్లో పునఃప్రారంభించారు. నిర్విరామంగా 45రోజుల పాటు జరిగే తాజా షెడ్యూల్తో తొలిభాగం చిత్రీకరణ పూర్తిచేయబోతున్నారని సమాచారం. ఎర్రచందనం స్మగ్లింగ్ ఇతివృత్తంతో చిత్తూరు నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్పరాజ్గా శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్రను పరిచయం చేస్తూ కొద్ది మాసాల క్రితం విడుదల చేసిన వీడియో అత్యధిక యూట్యూబ్ వీక్షణలతో తెలుగు చిత్రసీమలో సంచలనం సృష్టించింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మిరస్లోకుబా, సంగీతం: దేవిశ్రీప్రసాద్, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: సుకుమార్.