హమ్మయ్యా..ఎట్టకేలకు థియేటర్స్ తెరుచుకుంటున్నాయి. గత ఏడాదిన్నర కాలంగా థియేటర్ వ్యవస్థతో కరోనా వైరస్ దాగుడు మూతలు ఆడుతుంది. ఏడు నెలలకు పైగానే థియేటర్స్ పూర్తిగా క్లోజ్ చేసారు. ఆ సమయంలో ఎంతోమంది థియేటర్ యాజమాన్యం రోడ్డున పడ్డారు. కొన్ని వందల థియేటర్స్ కళ్యాణ మంటపాలుగా మారిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 200 థియేటర్స్ శాశ్వతంగా మూసేసారు. అలాంటి సమయంలో జనవరి నుంచి ఏప్రిల్ రెండో వారం వరకు థియేటర్స్ బాగానే ఓపెన్ అయ్యాయి. అలాటి సమయంలోనే సెకండ్ వేవ్ ఎవరూ ఊహించని స్థాయిలో ఇండియాపై కన్నెర్ర జేసింది.
దాంతో అప్పుడప్పుడే గాడిన పడుతున్న థియేటర్స్ వ్యవస్థపై మరోసారి కోలుకోలేని దెబ్బ పడిపోయింది. కొన్ని రోజులుగా కరోనా కేసులు భారీగానే తగ్గుతున్నాయి. దాంతో థియేటర్స్ తెరుచుకోడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసింది. జులై 8 నుంచి 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్స్ ఓపెన్ చేసుకోవచ్చు అంటూ సర్కార్ అనుమతులు ఇచ్చేసింది. అయితే అక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో థియేటర్స్ తెరిచినా కూడా ప్రేక్షకులు వస్తారా అనేది అనుమానమే. ఎందుకంటే మరో నెల రోజుల్లోనే కరోనా థర్డ్ వేవ్ కూడా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్న సమయంలో థియేటర్స్ వరకు ప్రేక్షకులు వచ్చేది డౌట్ ఫుల్ గానే ఉంది.
మరోవైపు థియేటర్స్ తెరిచినా సినిమాలు మాత్రం రావడం లేదు. సెకండ్ వేవ్ తీవ్రత చూసిన తర్వాత థియేటర్స్ అంటేనే భయపడుతున్నారు ప్రేక్షకులు. ఏపీలో 50 శాతం ఉన్నా కూడా తెలంగాణలో మాత్రం 100 శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్స్ ఓపెన్ చేసుకోవాలంటూ అనుమతులు ఇచ్చేసింది ఇక్కడి ప్రభుత్వం. అయితే ఇక్కడే అసలు సమస్య ఉంది. థియేటర్స్ ఓపెన్ చేయడం వరకు ఓకే కానీ సినిమాలు విడుదల చేస్తారా అనేది అసలు సమస్య. నిర్మాతలు ఇప్పటికీ ఓటిటి వైపు అడుగులు వేస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో థియేటర్స్ తెరిచినా ఆ ప్రభావం ఎంతవరకు ఉంటుందో చూడాలి.
ఇవి కూడా చదవండి..
తగ్గేదే లే అంటోన్న పూజాహెగ్డే..!
డేటింగ్ లో సారా అలీఖాన్..అతడెవరో తెలుసా…?
కొత్తింట్లోకి ‘రాఖీభాయ్’..ఫొటోలు వైరల్
రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు..రష్మికకు అభిమాని ప్రశ్న
నాలో మూడు మార్పులొచ్చాయి : సమంత
వెకేషన్ డేస్ను గుర్తు చేసుకున్న రకుల్..స్టిల్స్ వైరల్