గండీడ్, జూలై 2 : పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభు త్వం పని చేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నివర్గా ల అభ్యున్నతికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో ప్ర తి ఇంటికీ లబ్ధి చేకూరుతున్నదని తెలిపారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి దశరథ్, ఎంపీపీ మాధవి, జెడ్పీటీ సీ శ్రీనివాస్రెడ్డి, వైస్ఎంపీపీ ఈశ్వరయ్యగౌడ్, కోఆప్షన్ స భ్యుడు సలీం, తాసిల్దారు జ్యోతి, ఎంపీడీవో రూపేందర్రె డ్డి, డిప్యూటీ తాసిల్దార్ ఇంతియాజొద్దీన్, పీఏసీసీఎస్ వైస్చైర్మన్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
తాగునీటి సమస్య ఏర్పడొద్దు
మహ్మదాబాద్, జూలై 2 : ప్రజలకు తాగునీటి సమస్య ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని నంచర్ల స్టేజీ దగ్గర మిషన్ భగీరథ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుల్కచర్ల, గండీడ్, మహ్మదాబాద్ మండలాలకు సంబంధించి మిషన్ భగీరథ కార్యాలయాన్ని నంచర్ల స్టేజీ దగ్గర ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నీటి సరఫరాపై అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ మాధవి, జెడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు సలీం, వైస్ ఎంపీపీ ఈశ్వరయ్యగౌడ్, నాయకులు రాంచంద్రారెడ్డి, బాలవర్ధన్రెడ్డి, అశోక్గౌడ్, రమేశ్రెడ్డి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఆడపడుచుల పెండ్లిండ్లకు ఆర్థిక సాయం
కృష్ణ, జూలై 2 : ఆడపిల్లల పెండ్లి కోసం తల్లిదండ్రులు అప్పులు చేయకుండా సీఎం కేసీఆర్ పేదింటి ఆడపడుచుల కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశ పెట్టారని, పథకం ద్వారా చేస్తున్న ఆర్థిక సాయాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మండలంలోని తాసిల్దార్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి 69 మంది, షాదీముబారక్ ఆరుగురికి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పూర్ణిమాపాటిల్, జెడ్పీఈసీ అంజనమ్మపాటిల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు విజయ్పాటిల్, ప్రధాన కార్యదర్శి మోనేశ్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.