న్యూఢిల్లీ: లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ)పై పట్టు కోసం చిరాగ్ ప్వాశ్వాన్ తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీలోని తన నివాసంలో ఆదివారం పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ జాతీయ కార్యనిర్వాహక సమావేశంలో చాలా మంది సభ్యులు హాజరయ్యారయ్యారని, బహిష్కరించిన సభ్యులు పార్టీ చిహ్నం, పేరును ఉపయోగించడాన్ని సభ్యులు ఖండించడంతోపాటు వ్యతిరేకించారని సమావేశం అనంతరం చిరాగ్ తెలిపారు. తన తండ్రి జయంతి జూలై 5న అని చెప్పారు. తన తండ్రి, బాబాయ్ ఇప్పుడు తనతో లేరన్నారు. ఈ నేపథ్యంలో జూలై 5న హాజీపూర్ నుంచి ‘ఆశిర్వాద్ యాత్ర’ను చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. బీహార్లోని అన్ని జిల్లాల గుండా యాత్ర సాగుతుందని, రాష్ట్ర ప్రజల ప్రేమ, ఆశీర్వాదాలు తనకు అవసరమన్నారు.
రామ్ విలాస్ పాశ్వాన్కు భారత్ రత్న ఇవ్వాలని, బీహార్లో పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సమావేశంలో పాల్గొన్న ఎల్జేపీ నేతలు డిమాండ్ చేసినట్లు చిరాగ్ వెల్లడించారు. తన బాబాయ్ పశుపతి కుమార్ పరాస్ పార్టీ చీఫ్గా ఎన్నికైన నేపథ్యంలో తన బలాన్ని ప్రదర్శించేందుకు చిరాగ్ ఈ సమావేశాన్ని నిర్వహించారు.