ఢిల్లీ, జూన్,20:అంతర్జాతీయ యోగ దినోత్సవం పురస్కరించుకుని ఆ స్ఫూర్తినిప్రతిబింబించేలా రేపు తపాలాశాఖ ప్రత్యేక స్టాంపును తీసుకురావాలనిసంకల్పించింది. ఓ ప్రత్యేక ఫొటోతో ఉన్నఈ తపాలా బిళ్ళను దేశవ్యాప్తంగా 810హెడ్ పోస్ట్ ఆఫీసుల్లో అందుబాటులోకి తీసుకురన్నారు. ఒకే సారి ఇన్నిప్రాంతాల్లో స్మారక తపాలా బిళ్ళను ఇప్పటి వరకు ఎప్పుడూ అందించలేదు. ఇదే తొలిసారి.
డెలివరీ, నాన్-డెలివరీ హెడ్ పోస్టాఫిసులన్నిటిలో రేపు బుక్ చేసే మెయిల్స్ లో ఈ స్మారక తపాలా బిళ్ళను వాడతారు. సిరా మార్కు లేదా ముద్రను యోగ దినోత్సవాన్ని ప్రతిబింబించేలా రూపొందించారు. అంతర్జాతీయ యోగ దినోత్సవం21 జూన్ 2021 అని ఆంగ్లం, హిందీ భాషల్లో ఆ ప్రత్యేక తపాలాపై ముద్రించి ఉంటుంది. తిరిగి ఆ బిళ్ళను మరో సారి వినియోగించుకునే వీలు లేకుండా క్యాన్సిలేషన్ స్టాంపుపై ప్రత్యేక ముద్ర వేస్తారు.
కొన్ని సంవత్సరాలు క్రితం వరకు తపాలా బిళ్ళల సేకరణ అనేది ఒక అభిరుచులా ఉండేది, అయితే ఆ ఆసక్తి క్రమేణా తగ్గుతూ వస్తున్నది. ఈ అభిరుచిని పునరుద్ధరించడానికి తపాలా శాఖ ఫిలాటెలిస్టులకు ఒక పథకాన్ని అమలు చేస్తున్నది. కొన్ని ఎంపిక చేసిన పోస్ట్ ఆఫీసులలో విభిన్న తపాలా బిళ్ళను సేకరించే వారి కోసం ఫిలాటలిక్ బ్యూరోలను ఏర్పాటు చేశారు. వాటిలో రూ.200 డిపాజిట్ చేసి స్టాంపులు, ప్రత్యేక కవర్లను పొందవచ్చు. వీటితో పాటు స్మారక తపాలా బిళ్ళలు ఈ బ్యూరోలలో ఫిలాటలిక్ డిపాజిట్ స్కీం కింద లభిస్తాయి. అయితే అటువంటి స్టాంపులను పరిమితంగా ముద్రిస్తారు.