న్యూఢిల్లీ : అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం ఆలయ ట్రస్ట్ కొనుగోలు చేసిన భూమి వ్యవహారంలో వెలుగుచూసిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ కాంగ్రెస్ నేత పీసీ శర్మ భోపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయోధ్యలో రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ భూమి కొనుగోలులో అవకతవకలకు పాల్పడిందనే ఆరోపణలు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.
నిర్మోహి అఖార సన్యాసి రూ 1200 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారని శర్మ మీడియా సమావేశంలో ప్రస్తావించారు. ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ ఇతరులపై 420 సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా అయోధ్యలో రూ 2 కోట్ల విలువైన భూమిని ఆలయ ట్రస్ట్ ఏకంగా రూ 18.5 కోట్లకు కొనుగోలు చేసిందని ఎస్పీ, కాంగ్రెస్, ఆప్ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.