మహబూబాబాద్ : మారుమూల ప్రాంతాల్లోని పేద ప్రజలకు కూడా సీఎం కేసీఆర్ నాయకత్వంలో మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ములుగు నియోజకవర్గంలోని అత్యంత మారుమూల ప్రాంతం కొత్తగూడ. ఇక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా సాధారణ ప్రసవాలు చేస్తూ తెలంగాణ వైద్యులు పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించడాన్ని మంత్రి అభినందించారు.
కొత్తగూడలోని దవాఖానలో మహిళకు నార్మల్ డెలివరీ కాగా మంత్రి, ఎమ్మెల్యే సీతక్క, జడ్పీ చైర్పర్సన్ కుమారి బిందుతో కేసీఆర్ కిట్ అందించారు. అలాగే వానాకాలం సీజన్లో డెంగీ ప్రబలకుండా ఉండేందుకు దోమతెరలు పంపిణీ చేశారు.
ఇక్కడి ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నాయని మంత్రి చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ గౌతం, ఏటూరు నాగారం ఐటీడీఏ పీవో హన్మంతు జండగే, అదనపు ఎస్పీ యోగేష్ గౌతమ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
కార్మికులకు అండగా నిలిచిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
భూమికి బరువయ్యేంత పంట పండిస్తాం : మంత్రి హరీశ్ రావు
దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్ల పంపిణీ
ఎంపీ వెంకటేష్కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ కవిత
ఐసోలేషన్ సెంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే కిషోర్ కుమార్
200 కోట్ల డాలర్లు విరాళం ఇచ్చిన జెఫ్ బెజోస్ మాజీ భార్య