వనపపర్తి : పేద ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం మంత్రి నివాసంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..పేదలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు.
గతంలో కల్యాణ లక్ష్మికింద ఏ ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయలేదన్నారు.
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం రూ. ఒక లక్ష 116 లు అందజేస్తూ పేదలకు అండగా నిలిచిందన్నారు. అంతేకాక వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయనిధి కింద ఆర్థిక సహాయం అదజేస్తున్నట్లు ఆయన వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి 58 మంది లబ్ధిదారులకు రూ. 14, 50, 500 ల సీఎం ఆర్ ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాగర్ కర్నూలు ఎంపీ రాములు, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్,వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కమిషనర్ మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
పవిత్ర స్నానాల కోసం వచ్చి ప్రాణాలు విడిచారు
అందరికి హెల్త్ ప్రొఫైల్.. అదే సీఎం కేసీఆర్ లక్ష్యం
కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు నీటి విడుదల
ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం
ప్రభుత్వ వైద్య రంగంలో మరో మందడుగు : మంత్రి పువ్వాడ
తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి సబితా రెడ్డి
రేపు ఆకాశంలో ఆవిష్కృతమవనున్న అద్భుతం