ముషీరాబాద్, జూన్ 5: కరోనా కష్టకాలంలోనూ బడుగు, బలహీన వర్గాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరికీ పదిహేను కిలోల బియ్యం పంపిణీ చేస్తూ పేదలకు అండగా నిలుస్తున్నదని అన్నారు. శనివారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని అడిక్మెట్ పాపడ్గల్లి, ముషీరాబాద్ వైఎస్ఆర్ పార్కు వద్ద అదనపు కోటా రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడుతూ.. లాక్డౌన్ అమలు నేపథ్యంలో పనులు లేక ఇబ్బందులు పడుతున్న పేదలకు కేసీఆర్ ప్రభుత్వం ఒక్కొక్కరికీ 15 కిలోల చొప్పున బియ్యం అందించి ఆదుకుంటున్నదన్నారు. గత ఏడాది కాలంగా పాఠశాలలు మూతపడటంతో ఏరాష్ట్రంలో లేని విధంగా ప్రైవేటు టీచర్లకు బియ్యం పంపిణీతో పాటు నెల నెలా రెండు వేల ఆర్థిక సహాయం అందించి చేయూతనందిస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాధవ్, బి.శ్రీనివాస్రెడ్డి, శ్యామ్సుందర్, సురేందర్, మల్లికార్జున్రెడ్డి, సయ్యద్ అస్లాం, ముచ్చకుర్తి ప్రభాకర్, హమ్మదుల్లా, రవియాదవ్, సాంబశివరావు, రజిని, మచ్చేందర్, శ్రీధర్రెడ్డి, లక్ష్మణ్గౌడ్, సంపూర్ణ, గజ్జెల సూర్యనారాయణ, ఎయిర్టెల్ రాజు, మురళి తదితరులు పాల్గొన్నారు.
కవాడిగూడ: కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ కారణంగా పేదలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బియ్యం పథకం కార్యక్రమాన్ని చేపట్టిందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ అవకాశాన్ని పేదలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం కవాడిగూడ డివిజన్లోని ఉన్నికోట, భోలక్పూర్ డివిజన్లోని బ్యాంక్ ఆఫ్ బరోడా కాలనీలో తెల్ల రేషన్ కార్డు దారులకు ఉచితంగా ఒక్కక్కరికీ 15 కిలోల బియ్యం పంపిణీ పథకం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కవాడిగూడ, భోలక్పూర్ డివిజన్ల టీఆర్ఎస్ అధ్యక్షులు రాంచందర్, మహ్మద్ అలీ, ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ రావు, సురేందర్, ముచ్చకుర్తి ప్రభాకర్, శ్రీనివాస్, ఎయిర్టెల్ రాజు, నాయకులు మున్వర్ చాంద్, రహీం, అబ్రహర్ హుస్సేన్, జబ్బార్, రాజేశ్, శివ, హరి, రవియాదవ్, శంకర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
చిక్కడపల్లి: కరోనా కష్ట కాలంలో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని విధాలుగా అండగా నిలబడి ఆదుకుంటున్నారని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. తెల్లరేషన్ కార్డు దారులకు ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని శనివారం గాంధీనగర్ డివిజన్లోని మళియలం చర్చి వద్ద ఉన్న రేషన్ షాపులో ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ముఠా పద్మానరేశ్, సీనియర్ నాయకుడు ముఠా నరేశ్, యువ నాయకుడు ముఠా జైసింహ, డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా, శ్రీకాంత్, ముచ్చకుర్తి ప్రభాకర్, గుండు జగదీశ్ బాబు, రాకేశ్, ఆకుల శ్రీనివాస్, రవి శంకర్ గుప్తా, భాస్కర్, యాసీన్, జహంగీర్, పున్న సత్యనారాయణ, హనుమంతు, సుధాకర్, వంశీ, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.