పరిగి, జూన్ 4 : ప్రతి గిరిజన తండాకు బీటీ రోడ్డు నిర్మాణానికి సర్కారు కృషి చేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. జనాభా ప్రాతిపదికన తండాలకు బీటీ రోడ్డు సదుపాయం కోసం సర్కారు నిధులు మంజూరు చేస్తుందన్నారు. శుక్రవారం పరిగి మండలం జీడిగడ్డతండాకు ఎస్టీఎస్డీఎఫ్ కింద మంజూరైన రూ.75లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే మహేశ్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజనతండాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రత్యేక గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసిందన్నారు. ప్రతి గిరిజనతండాకు బీటీ రోడ్డు సదుపాయం కల్పించడం ద్వారా మరింత అభివృద్ధికి సర్కారు నిర్ణయించిందన్నారు. విడుతల వారీగా నిధులు విడుదల అవుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ కె.అరవిందరావు, వైస్ ఎంపీపీ సత్యనారాయణ, టీఆర్ఎస్ నాయకులు బి.ప్రవీణ్కుమార్రెడ్డి, సర్పంచ్ రమేశ్, పంచాయతీరాజ్ డిప్యూటీ ఈఈ సుదర్శన్రెడ్డి పాల్గొన్నారు.