జగిత్యాల : జిల్లాలోని వెల్గటూర్ మండలం స్తంబంపల్లి గ్రామం పరిధిలో రూ.4 కోట్ల 60 లక్షలతో నిర్మించ తలపెట్టిన హరిత హోటల్ నిర్మాణానికి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తాతో కలిసి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు.
అనంతరం మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో ధర్మపురి లక్ష్మి నరసింహా స్వామి దేవాలయం, కోటిలింగాల వంటి పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు ఉన్నాయన్నారు.
ఇప్పటికే ఈ ప్రాంతాలకు ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకులు, భక్తులు నిత్యం అధిక సంఖ్యలో వస్తున్నారని తెలిపారు. కోటి లింగాలను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు తాము నిరంతరం శ్రమిస్తున్నామన్నారు.
అందులో భాగంగా కోటిలింగాల దేవస్థానంలో టూరిజం ఆధ్వర్యంలో రూ.2 కోట్లతో శాతకర్ణి, పూలోమావి రెండు బోట్లు పర్యాటకుల కోసం అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, ఎంపీపీ కూనమల్ల లక్ష్మీ లింగయ్య, సర్పంచ్ స్వరూప రాణి, ఎంపీటీసీ సతీష్, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ధరణి పోర్టల్ రైతులకు వరం : మంత్రి వేముల
తెలంగాణ వచ్చాకే కవులు, కళాకారులకు గుర్తింపు
యాదాద్రిలో పసిడి కాంతుల ధగధగ