హల్ద్వాని: ఉత్తరాఖండ్లోని హల్ద్వినిలో డీఆర్డీవో 500 పడకల కోవిడ్ హాస్పిటల్ను ఏర్పాటు చేసింది. ఇవాళ ఆ రాష్ట్ర సీఎం తీరత్ సింగ్ రావత్ ఆ హాస్పిటల్ను వర్చువల్గా ప్రారంభించారు. ఆ హాస్పిటల్లో 375 ఆక్సిజన్ బెడ్లు, వెంటిలేటర్లతో కలిపి 125 ఐసీయూ బెడ్స్ ఉన్నాయి. రేపటి నుంచి పూర్తి స్థాయిలో హాస్పిటల్ అందుబాటులో ఉంటుందని డీఆర్డీవో అధికారులు చెప్పారు. కోవిడ్ కేర్ సెంటర్ను మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ చంద్ర జోషి పేరును పెట్టినట్లు డీఆర్డీవో అధికారులు తెలిపారు.