సీనియర్ హీరో మోహన్బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. డైమండ్ రత్నబాబు దర్శకుడు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు నిర్మిస్తున్నారు. ఈ నెల 4వ తేదీన టీజర్ విడుదల చేయబోతున్నారు. ‘30ఏళ్ల క్రిందట జూన్ 4న మోహన్బాబు నటించిన ‘అసెంబ్లీరౌడీ’ చిత్రం విడుదలై అనేక సంచలనాల్ని సృష్టించింది. అలాంటి శుభదినాన ‘సన్ ఆఫ్ ఇండియా’ టీజర్ విడుదల చేయబోతుండటం ఆనందంగా ఉంది. వాస్తవిక సంఘటనలతో రూపొందిస్తున్న చిత్రమిది. మోహన్బాబు పాత్ర చిత్రణ శక్తివంతంగా సాగుతుంది. ఆయన శైలి సంభాషణలు ప్రతి ఒక్కరిని అలరిస్తాయి. సందేశం కలబోసిన ఈ సినిమా అన్ని వర్గాలను మెప్పిస్తుంది’ అని చిత్రబృందం తెలిపింది.