అరటి పండు.. సామాన్యుడి ఫలం. సామాన్యులే కాదు సంపన్నులు సైతం ఇష్టంగా తినే ఎన్నో పోషకాలున్న ఫలాహారం. అరటి.. ప్రకృతి ప్రసాదించిన గొప్ప చెట్టు. ప్రకృతిలో ఏ చెట్టుకు లేని గొప్పతనం అరటి సొంతం. ఈ చెట్టులో ప్రతీ భాగం ఉపయోగపడేదే. అరటి కాయ, అరటి పండు, అరటి ఆకు, అరటి కాండం, అరటి పువ్వు.. ఇలా అన్ని భాగాలు ఉపయోగపడేవే. అంతే కాదు… ఎంతో ఆరోగ్యవంతమైనవి కూడా. సీజన్ తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా కాసే ఒకే ఒక్క చెట్టు అరటి. అరటి కాయ, అరటి పండు ఏ ప్రాంతానికి వెళ్లినా సంవత్సరమంతా దొరుకుతాయి. రోజు ఆహారంలో ఏదో రూపంలో అరటిని తీసుకుంటే సర్వరోగాల నివారణ సాధ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అరటి పండులో ఎన్నో ఆరోగ్య సూత్రాలు దాగి ఉన్నాయి. మన శరీరానికి తగినన్ని పోషకాలు అందాలంటే ప్రతిరోజు రెండు అరటి పళ్ళు తినాలి. జబ్బు పడినవారు తింటే తొందరగా కోలుకుంటారు. శరీర కండరాలను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు రక్త కణాలను అభివృద్ధి చేస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలకు చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. అరటిలో పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల రక్తపోటు, గుండెకు సంబంధించిన వ్యాధులకు చెక్ పెడుతుంది. అరటిని ఏ రూపంలో తీసుకున్నా అది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కంటికి సంబంధించిన వ్యాధులు, గ్యాస్ సమస్యలు, క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుందని వైద్య శాస్త్రం చెప్తున్నది. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉండి మలబద్దకాన్ని నివారిస్తుంది. అరటి పువ్వులో పెరుగు కలుపుకుని తింటే స్త్రీలను వేధించే వ్యాధులను అరికడుతుంది.
అరటిలో విటమిన్-బీ పుష్కలంగా లభిస్తుంది. చిన్న పిల్లలకు దీన్ని క్రమం తప్పకుండా అలవాటు చేస్తే శరీరంలోని ఖనిజ లోపాలు వల్ల ఏర్పడే సమస్యలు త్వరగా తగ్గిపోతాయి. జ్వరం, జలుబు, దగ్గు ఉన్నవారు అరటిపండును తినకపోవడమే మంచిది. రే చీకటి వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా అరటి కాయగానీ, అరటి పండుగాని తింటే ఈ వ్యాధి నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే కాండం లోపలి భాగాన్ని కూర, పచ్చడి, పప్పు ధాన్యాలతో కలిపి వండితే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం. దీన్ని తీసుకోవడం వల్ల మల బద్దకం, శ్లేష్మం, వాతపు నొప్పులు, పైత్యం వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు.
అరటిపండే కాకుండా అరటి తొక్క కూడా మనకు ఆరోగ్యప్రదాయినిగా ఉంటుంది. అరటితొక్కలోని పీచు గుండెజబ్బులు రాకుండా కాపాడుతాయని పరిశోధనలు తేల్చారు. అందుకే ఇవ్వాల్టి నుంచి అరటిపండును.. కాదు అరటి పదార్థాలను తినడం అలవాటు చేసుకోండి. ఆరోగ్యంగా ఉండండి.
ఆఫ్ఘనిస్తాన్లో విస్తరిస్తున్న తాలిబాన్.. మూడు జిల్లాలు స్వాధీనం
మయన్మార్లో అంతర్యుద్ధానికి అవకాశాలు : యూఎన్ హెచ్చరిక
విరాట్ సేనకు వెటరన్ క్రికెటర్ రిచర్డ్ హాడ్లీ ప్రశంసలు
ఒలింపియన్ సుశీల్ కుమార్ను సస్పెండ్ చేసిన రైల్వే
సీబీఐ డైరెక్టర్ ఎంపిక : జస్టిస్ రమణ అభ్యంతరంతో ఇద్దరి పేర్లు ఔట్..?!
అమరీందర్కు పక్కలో బళ్లెంలా సిద్దూ
నక్సల్స్ దాడిలో కాంగ్రెస్ నేతల మృతి.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..