సౌత్ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ భారత్లో మరో సరికొత్త స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. గెలాక్సీ ఎం32 ఫోన్ను త్వరలోనే భారత్లో విడుదల చేయనుంది. ఈ మేరకు శాంసంగ్ ఇండియా వెబ్సైట్లో ఓ సపోర్ట్ పేజీ ఒకటి కొత్త ఫోన్ రిలీజ్కు సంబంధించిన విషయాన్ని తెలియజేస్తోంది. గెలాక్సీ ఎం32 ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారంగా పనిచేస్తుంది.
ఇందులో మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్, 6జీబీ ర్యామ్, 6,000mAh బ్యాటరీ, 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 64 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 6.4 అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్ప్లే వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఆన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో విడుదలకాబోతున్న ఈ ఫోన్.. బ్లాక్, వైట్, బ్లూ కలర్లలో లభించే అవకాశం ఉంది. కొన్ని చిన్న మార్పులు మినహా గెలాక్సీ ఎ32 స్మార్ట్ఫోన్ రీబ్రాండెడ్ వెర్షన్గా గెలాక్సీ ఎం32 రిలీజ్ అవుతోందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.