జ్యోతినగర్(రామగుండం), మే 24: లాక్డౌన్ వేళల్లో ప్రజలెవరూ బయటికి రావద్దని రామగుం డం సీపీ సత్యనారాయణ సూచించారు. రామగుండం పోలీస్స్టేషన్ పరిధి మసీద్ టర్నింగ్, రైల్వేస్టేషన్ ఏరియాలో రామగుండంలో అడిషనల్ డీసీపీ సంజీవ్తో కలిసి సోమవారం లాక్డౌన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడా రు. కరోనా సెకండ్వేవ్ విజృంభిస్తున్నా కొందరు బాధ్యతారహితంగా రోడ్లమీదికి వస్తున్నారని వివరించారు. ఇక్కడ రామగుండం సీఐ లక్ష్మీనారాయణ, ఎస్ఐ మామిడి శైలజ, పీఎస్ఐ శరణ్య ఉన్నారు. అలాగే పెద్దపల్లి డీసీపీ రవీందర్ ఎన్టీపీసీ ఎఫ్సీఐ క్రాస్రోడ్లో లాక్డౌన్ పర్యవేక్షించారు. 15 వాహనాలను పోలీస్స్టేషన్కు తరలించారు. ఇక్కడ ఎన్టీపీసీ ఎస్ఐ స్వరూప్ రాజ్ ఉన్నారు.
కట్టడికి కఠిన చర్యలు
పెద్దపల్లిటౌన్, మే 24: కరోనా కట్టడికి కఠిన చర్యలు తప్పవని పెద్దపల్లి డీసీపీ రవీందర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పలు ఏరియాల్లో డీసీపీ సోమవారం పర్యటించి, లాక్డౌన్ను పరిశీలించారు. వాహనాలు తనిఖీ చేసి,అనవసరంగా రోడ్లపైకి వచ్చేవారికి కౌన్సెలింగ్ ఇచ్చా రు. ఇక్కడ ఏసీపీ సారంగపాణి, సీఐ ప్రదీప్కుమార్, ట్రాఫిక్ సీఐ అనిల్కుమార్, ఎస్ఐలు రాజేశ్, సహదేవ్సింగ్, ఇసాక్హైమద్, పీఎస్ఐ రాజవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
25 కార్లు, 10 బైక్లు సీజ్
సుల్తానాబాద్, మే 24 : రామగుండ సీపీ ఆదేశాల మేరకు మూడు రోజులుగా లాక్డౌన్ స్పెషల్ డ్రైవ్ కొనసాగిస్తున్నారు. సుల్తానాబాద్ సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ ఉపేందర్రావు ఆధ్వర్యంలో రాజీవ్ రహదారిపై వాహనాలు తనిఖీ చేశారు. అనుమతి పత్రాలు లేని 25 కార్లు, 10 బైక్లను సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు. ఇక్కడ పీఎస్ఐ జ్యోత్స్న, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
జూలపల్లి, మే 24: ఎస్ఐ షేక్ జానీపాషా ఆధ్వర్యంలో మండల వ్యాప్తంగా తనిఖీలు ము మ్మరం చేస్తున్నారు. జూలపల్లి వారసంతలో భౌతిక దూరం పాటించని వ్యక్తులపై పోలీసులు కొరడా ఝుళిపించారు. విచ్చల విడిగా రోడ్లపై సంచరిస్తున్న వ్యక్తులను పట్టుకున్నారు. ఇప్పటి దాకా 2 వందల మందిపై కేసులు నమోదు చేశామని, 80 వాహనాలు స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ వెల్లడించారు.
డ్రోన్ కెమెరాతో పర్యవేక్షణ
మంథని టౌన్, మే 24: మంథనిలో డ్రోన్ కెమెరాతో లాక్డౌన్ ప్రక్రియను పర్యవేక్షిస్తామని మంథని సీఐ సతీశ్ వెల్లడించారు. మంథని పట్టణాన్ని డ్రోన్ కెమెరాతో సీఐ సోమవారం పరిశీలించారు. ఆయన వెంట ఎస్ఐ చంద్రకుమార్, పీఎస్ఐ ఆజయ్ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే లాక్డౌన్ ప్రక్రియను మంథనిలో నికితాపంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో రోడ్ల పైకి వచ్చిన వాహనాలను ఆపి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ ఉమేందర్, మంథని సీఐ సతీశ్, ఎస్ఐ చంద్రకుమార్, పీఎస్ఐ అజయ్ ఉన్నారు.
ఫర్టిలైజర్సిటీ, మే 24: కరోనా నియంత్రణలో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన లాక్డౌన్ 13వ రోజుకు చేరింది. పెద్దపల్లి డీసీపీ రవీందర్, ఏఆర్ డీసీపీ సంజీవ్, పెద్దపల్లి ట్రెయినీ ఐపీఎస్ నికితాపంత్, గోదావరిఖని ఏసీపీ ఉమేందర్ ఆధ్వర్యంలో సీఐ రమేశ్బాబు లాక్డౌన్ను పరిశీలించారు. తెరిచి ఉన్న 8 షాపులపై కేసులు నమోదు చేసి 25 వాహనాలు సీజ్ చేశారు. ఇక్కడ ఎస్ఐలు ప్రవీణ్కుమార్, ఉమాసాగర్ ఉన్నారు.