ముంబై: న్యూజిలాండ్తో ప్రతిష్టాత్మక ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్(డబ్ల్యూటీసీ)తో పాటు ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ కోసం విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు జూన్ 2న ఇంగ్లాండ్ బయల్దేరనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ జూన్ 18న ఆరంభంకానుంది. ఈ నేపథ్యంలోనే టీమ్ఇండియా ఆటగాళ్లు ముంబైలో క్వారంటైన్లోకి వెళ్లారు.
సుదీర్ఘ పర్యటన కోసం ఇంగ్లాండ్ బయల్దేరేముందు ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సోమవారం భారత జట్టుతో కలిసి ముంబైలో తన క్వారంటైన్ను ప్రారంభించాడు. ముంబైకి వచ్చినట్లు జడేజా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ ద్వారా వెల్లడించాడు. జడ్డూ తన హోటల్ గదిలో రెడ్ టీ షర్టు ధరించి ఉండగా తీసిన మిర్రర్ సెల్ఫీని సోషల్మీడియాలో షేర్ చేశాడు. జర్నీ ప్రారంభమైంది అని వ్యాఖ్యానించిన జడేజా క్వారంటైన్, ముంబై అనే హ్యాష్ట్యాగ్లు జోడించాడు.