సిటీబ్యూరో, మే 23 (నమస్తే తెలంగాణ) : కొవిడ్ నియంత్రణలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రేటర్ హైదరాబాద్లో నిర్వహిస్తున్న ఫీవర్ సర్వే రెండో విడుత ఆదివారం నుంచి ప్రారంభమైంది. తొలి విడుతలో 17,14,477 ఇండ్లలో ఫీవర్ సర్వే చేపట్టారు. రెండో విడుతలో తొలిరోజు 1573 బృందాలతో 19 లక్షల ఇండ్లలో పరీక్షలు నిర్వహించి.. ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. జ్వరం , జలుబు, దగ్గు, ఇతర లక్షణాలను నమోదు చేసుకున్నారు. తీవ్రమైన లక్షణాలు ఉన్న వారిని గుర్తించి ఔషధ కిట్లను అందజేశారు.