అజ్మీర్ : రాజస్థాన్లోని అజ్మీర్లో ఉన్న ఇజ్రాయెల్ మందిరం ఖబాద్ హౌస్ భద్రంగా ఉన్నది. రాజస్థాన్ ప్రభుత్వం ఈ భవనం వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసింది. 24 గంటలు సాయుధ సిబ్బందిని మోహరిస్తున్నారు. సీసీటీవీలతో పర్యవేక్షిస్తున్నారు. ఇజ్రాయెల్-హమాస్ వివాదం మధ్య అజ్మీర్లోని ఖబాద్ హౌస్ ప్రస్తుతం వార్తల్లో ప్రదేశంగా నిలిచింది.
ఇజ్రాయెల్ వాసులు పవిత్రంగా భావించే ఖబాద్ భవనం అజ్మీర్కు సమీపంలోని పుష్కర్లో ఉన్నది. గత ఏడాది కాలంగా దీనికి తాళాలు వేసి ఉంచారు. సమీప భవిష్యత్లో కూడా తెరిచే అవకాశాలు లేవు. ఇజ్రాయెల్ ధర్మ గురువు ఇక్కడికి రాకపోవడం వల్ల దీనిని మూసివుంచుతున్నారు. కరోనా కారణంగా ఇజ్రాయెల్ ధర్మ గురువు అక్కడే ఉండిపోయారు. వచ్చే సెప్టెంబర్లో ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నది. ఏటా ఐదు నెలలపాటు ఈ హౌస్ను మూసివుంచుతారు.
ఇజ్రాయెల్-హమాస్ వివాదం నేపథ్యంలో ఇక్కడ ఉన్న ఖబాద్ హౌస్కు ఎలాంటి నష్టం జరుగకుండా పటిష్ఠ భద్రత కల్పించారు. 24 గంటలపాటు ఆర్ఐసీ (రాజస్థాన్ సాయుధ కాన్స్టేబులరీ) సాయుధ సిబ్బందిని కాపలాగా ఉంచారు. అలాగే సీసీటీవీ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఈ భవనంలోకి ప్రజల రాకపోకలపై నిషేధం ఉన్నదని మేనేజర్ హనుమాన్ బకోలియా తెలిపారు.
ఖబాద్ హౌస్ కూడా ఉగ్రవాదుల హిట్ జాబితాలో ఉన్నది. ముంబై దాదులకు సూత్రధారి అయిన డేవిడ్ కోల్మన్ హెడ్లీ రాకి దాడి చేయడంలో విఫలమయ్యాడు. దాంతో ప్రభుత్వం ఖబాద్ హౌస్ను భద్రత సిబ్బంది అదుపులోకి తీసుకున్నది. ఎప్పటికప్పుడు పోలీసు అధికారులు, భద్రతా సంస్థల అధికారులు ఖబాద్ హౌస్ భద్రతను తనిఖీ చేస్తుంటారు.
24 మందితో న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్.. చరిత్రలో ఈ రోజు
యుద్ధం కొనసాగుతుంది: బెంజిమిన్ నెతన్యాహు
అమెరికా ఉద్యోగం కన్నా పాడిలో నాలుగింతలు ఎక్కువ సంపాదన : కిషోర్ మంత్రం
గంగా నది ఇసుకలో సమాధులు.. వెలికితీసిన వరుణుడు
టెస్ట్ ఆడట్లేదని నేననలేదు : భువనేశ్వర్ కుమార్
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..