ఎల్ఐసీ ఉద్యోగులకు ఆఫర్
న్యూఢిల్లీ, మే 6: ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ.. ఎట్టకేలకు ఉద్యోగులకు శుభవార్తను అందించింది. వచ్చే సోమవారం నుంచి వారానికి ఐదు రోజులు మాత్రమే పనిచేయనున్నది. ప్రతి శనివారం దేశీయంగా ఉన్న అన్ని కార్యాలయాలు పనిచేయబోవని కంపెనీ ఒక ప్రకటనలలో వెల్లడించింది. గత నెల 15న తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం..ప్రతి శనివారం ఎల్ఐసీ ఉద్యోగులకు సెలవు దినంగా ప్రకటించింది. ఇక సోమవారం నుంచి శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు కార్యాలయాలు తెరిచివుండనున్నాయి.