న్యూఢిల్లీ: భారత్లో కరోనా బాధితులను ఆదుకునేందుకు పలువురు క్రికెటర్లు ముందుకు వస్తూనే ఉన్నారు. కొవిడ్పై భారత్ పోరాటానికి సహాయ పడేందుకు ఐపీఎల్ ఆటగాళ్లు తమవంతు సాయాన్ని
ప్రకటిస్తున్నారు. ఇప్పటికే పాట్ కమిన్స్, బ్రెట్ లీ, సచిన్, శిఖర్ ధావన్, జయదేవ్ ఉనద్కత్, రహానె, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు కూడా సాయం చేసిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జేసన్ బెహ్ర్నెండార్ఫ్ కూడా విరాళం ప్రకటించాడు. యూనిసెఫ్ ద్వారా భారత్కు సాయం చేయనున్నట్లు బెహ్ర్నెండార్ఫ్ తెలిపాడు. భారత్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని ఆసీస్ పేసర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
చాలా మంది ఆటగాళ్ల మాదిరిగానే తనకు భారత్ అంటే ప్రత్యేక అభిమానం ఉందని వివరించింది.
తప్పనిసరి క్వారంటైన్ను పూర్తి చేసుకున్న బెహ్ర్నెండార్ఫ్ సీజన్లో ఇప్పటి వరకు చెన్నై తరఫున ఒక్క మ్యాచ్ ఆడలేదు. ఈ ఏడాది వేలంలో అతన్ని ఎవరూ కొనుగోలు చేయలేదు. జోష్ హేజిల్వుడ్ ఐపీఎల్ నుంచి తప్పుకోవడంతో అతని స్థానంలో బెహ్ర్నెండార్ఫ్ను చెన్నై తీసుకుంది.