దేశానికే ఆదర్శం తెలంగాణ పథకాలు
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
కొడిమ్యాలలో కల్యాణలక్ష్మి చెక్కులు, ముస్లింలకు దుస్తులు పంపిణీ
కొడిమ్యాల, మే 3: అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర సర్కారు పని చేస్తున్నదని, కులమతాలకతీతంగా పాలన కొనసాగిస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఉద్ఘాటించారు. రా ష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం 38 మందికి మంజూరైన రూ.38,0 4,408 కల్యాణలక్ష్మి చెక్కులను, 120 మంది ముస్లింలకు రంజాన్ పండుగ సందర్భంగా దు స్తులను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డల కుటుంబాలకు భరోసా ఇస్తున్నాయన్నారు. ప్రతి మతాన్ని ప్రభుత్వం గౌరవిస్తున్నదని చెప్పారు. దసరా, క్రిస్మస్, రంజాన్ సందర్భంగా ఆయా మతాల వారికి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా దుస్తులను అందజేస్తున్నదని గుర్తుచేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ స్వర్ణ, ఎంపీడీవో రమేశ్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు పునుగోటి కృష్ణారావు, కొడిమ్యాల సింగిల్ విండో చైర్మన్ మెన్నేని రాజనర్సింగరావు, వైస్ ఎంపీపీ పర్లపల్లి ప్రసాద్, ఎంపీటీసీ సభ్యులు ఉ ట్కూరి మల్లారెడ్డి, డబ్బు జగన్మోహన్రెడ్డి, సర్పంచ్లు పిల్లి మల్లేశం, బొజ్జానాయక్, నాయకులు చీకట్ల మహేందర్, బోడ్డు రమేశ్, పెద్ది రవికుమార్, బండపల్లి అంజన్కుమార్, నేరేళ్ల మహేశ్, కొత్తూరి స్వామి, చాంద్పాషా, శరత్ ఉన్నారు.