జోగులాంబ గద్వాల : తెలంగాణ జాగృతి జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు వెంగల్రెడ్డి గుండెపోటుతో ఈ ఉదయం మృతిచెందారు. ఆయన వయస్సు 53 సంవత్సరాలు. గుండెపోటు రావడంతో చికిత్స నిమిత్తం జిల్లా దవాఖానకు తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.