జగిత్యాల రూరల్, మే 2: ‘ఎన్నిక ఏదై నా టీఆర్ఎస్దే విజయం..ఈ విషయం నాగర్జున సాగర్ ఎన్నికల్లో నిరూపితమైం ది’ అంటూ ఎమ్మెల్యే సం జయ్కుమార్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు బ్యాలెట్తో సమాధానం చెప్పారన్నారు. బీజేపీ వాపును చూ సి బలుపనుకొంటుందని, చావు తప్పి కన్నులొట్టబోయి దుబ్బాకలో గెలిచిందని, ఇప్పుడు డిపాజిటే కోల్పోయిందని ధ్వ జమెత్తారు. ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అనవసర విమర్శలు కట్టిపెట్టి అభివృద్ధికి స హకరించాలని హితవు పలికారు. ఎమ్మెల్యే క్యాం పు కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష అనే విష యం సాగర్ ఉప ఎన్నిక విజయంతో తేటతెల్లమైందన్నారు. కార్పొరేషన్, మున్సిపాలిటీలను సైతం తామే కైవసం చే సుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. జగిత్యా ల మున్సిపాలిటీలో మా స్టర్ ప్లాన్ లేక పట్ట ణం ఛి న్నాభిన్నమైందన్నారు. ఇన్నేండ్లు పాలించిన జీవన్రెడ్డి విమర్శలు మాని ఆత్మవిమర్శ చేసుకోవాలని దెప్పిపొడిచా రు. టీఆర్ఎస్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం హాస్యాస్పదమన్నా రు. బీజే పీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అ ర్వింద్ ఇష్టారాజ్యంగా మాట్లాడడం మా నుకొని కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన నిధులను తెప్పించాలని డిమాండ్ చేశారు. సాగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి భగత్ను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపా రు. కార్యక్రమంలో రాయికల్ మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు, జగిత్యాల రూరల్ ఎంపీపీ పాలెపు రాజేంద్రప్రసాద్, మై నార్టీ ఉపాధ్యక్షుడు ముజాహిద్ పట్వారీ పాల్గొన్నారు.