న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్కు యువ జిమ్నాస్ట్ ప్రణతి నాయక్ బెర్తు దక్కించుకుంది. ఆసియా అర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ చాంపియన్షిప్(2019)లో కాంస్య పతకం సాధించిన ప్రణతి…ఆసియా కోటా నుంచి అర్హత సాధించింది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 29 నుంచి హంగ్జు(చైనా) వేదికగా 9వ సీనియర్ ఆసియా చాంపియన్షిప్ జరుగాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ విజృంభణ కారణంగా ఈ టోర్నీ వాయిదా పడటంతో గత ప్రదర్శనను పరిగణనలోకి తీసుకున్నారు. అయితే ఆసియా, ప్రపంచ జిమ్నాస్టిక్స్ నుంచి అధికారిక సమాచారం కోసం వేచిచూస్తున్నానని ఆమె పేర్కొంది.