జగిత్యాల విద్యానగర్, ఏప్రిల్ 30 : కరోనాతో జగిత్యాల బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు భీమనాతిని శంకర్(65) శుక్రవారం మృతి చెందారు. 10 రోజుల క్రితం శంకర్కు కరోనా సోకగా జగిత్యాలలోని ఓ ప్రైవేట్ దవాఖాననలో చేరారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఓ దవాఖానలో చేర్పించారు. పరిస్థితి విషమించి శుక్రవారం మృతి చెందారు. శంకర్కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. శంకర్ మృతి పట్ల జగిత్యాల బార్ అసోసియేషన్ సంతాపం వ్యక్తం చేసింది.