నెల 1 నుంచి 18ఏళ్లు పైబడినవారికి వ్యాక్సిన్
చేస్తున్న వైద్యారోగ్యశాఖ
కూసుమంచి, ఏప్రిల్ 26 : రోజురోజుకూ కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం 45 ఏళ్ల్లు పైబడినవారికి వ్యాక్సిన్ వేస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో 18ఏళ్లు పైబడిన వారికీ ఉచితంగా టీకా ఇచ్చేందుకు ముందుకొచ్చింది. టీకా వేసుకునే వారు ఈ నెల 28 నుంచి కోవిన్, ఆరోగ్య సేతు యాప్లో పేరు నమోదు చేసుకునే అవకాశం కల్పించింది.
రోజురోజుకూ కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో సర్కారు కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకొంటున్నది. ఇప్పటివరకు ప్రభుత్వం 45 ఏళ్ల పైబడినవారికి వ్యాక్సిన్ వేశారు. అయితే, పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో 18ఏళ్లు పైబడిన వారికీ ఉచితంగా టీకా ఇచ్చేందుకు ముందుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ వేసేందుకు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు.
మండలాల వారీగా ఎంతమంది ఉన్నారు?
మండలాల్లో ఎంత మంది 45 నుంచి 18 ఏళ్ల వయస్సు వారు ఎంత మంది ఉన్నారు.? ఏ మండలానికి ఎన్ని వ్యాక్సిన్ డోస్లు అవసరమవుతాయి.? అనే దానిపై వైద్యారోగ్యశాఖ లెక్కలు వేస్తున్నారు. ఆసుపత్రులకు వచ్చి గంటల తరబడి నిరీక్షించకుండా, గుంపులు గుంపులుగా లేకుండా వచ్చినవారికి వచ్చినట్లు వ్యాక్సిన్ వేసి పంపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా, వ్యాక్సిన్ కోసం జనం ఒకేరోజు భారీగా తరలొచ్చి అక్కడ డోస్ల కొరతతో వెనుదిరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఆన్లైన్లో సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ నెల 28వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్నది. రిజిస్ట్రేషన్ చేయించుకుంటే వ్యాక్సిన్ వేయించుకునే రోజు, సమయం కేటాయిస్తారు. నిర్దేశించిన సమయంలో మనం వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు.