జోరుగా గులాబీ శ్రేణుల ప్రచారం
ఖమ్మం/ ఖమ్మం వ్యవసాయం, ఏప్రిల్ 26: ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రచారం హోరెత్తుతున్నది. టీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటికెళ్తూ.. పథకాలు వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. సోమవారం మంత్రి పువ్వాడ అజయ్కుమార్తోపాటు ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు హరిప్రియానాయక్, సండ్ర వెంకటవీరయ్య, మాగంటి గోపీనాథ్, అరికపూడి గాంధీ, మల్లయ్యయాదవ్, భాస్కర్రావు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పలు కార్పొరేషన్ల చైర్మన్లు ముమ్మరంగా ప్రచారం చేశారు.
రాష్ట్రంలోని ఏ ఎన్నికలు జరిగినా అంతిమ విజయం టీఆర్ఎస్దేనని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. కేఎంసీ ఎన్నికల్లో భాగంగా సోమవారం ఆయన 28, 29, 30, 35, 51 డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ ప్రచారం చేశారు. వైరా ఎమ్మెల్యే రాములునాయక్, మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, ఆర్జేసీ కృష్ణ, మద్దినేని బేబీ స్వర్ణకుమారి, చిత్తారు సింహాద్రి యాదవ్, శీలంశెట్టి వీరభద్రం, రాజేశ్ పాల్గొన్నారు.
భారీ మెజార్టీ ఇవ్వండి
కేఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు భారీ మెజార్టీ ఇవ్వాలని ఎంపీ నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆయా డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ సోమవారం ఆయన ప్రచారం నిర్వహించారు. నిజాయితీకి, నిబద్ధతకు నిలువుటద్దం శీలంశెట్టి దంపతులని అన్నారు. ఈ నెల 30న జరిగే కేఎంసీ ఎన్నికల్లో శీలంశెట్టి రమా వీరభద్రాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ మేరకు నగరంలోని 51వ డివిజన్లో ఖమ్మం ఏఎంసీ వైస్ చైర్మన్, డివిజన్ ఇన్చార్జి పిన్ని కోటేశ్వరరావుతో కలిసి నాయీబ్రాహ్మణకాలనీ, బుర్హాన్పురం తదితర కాలనీల్లో ఆయన ఇంటింటి ప్రచారం చేశారు.