హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ దేశరాజకీయాల్లో చెరగని ముద్ర చేసిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పార్టీ ఆవిర్భవించి అహింసా విధానంలో స్వరాష్ర్టాన్ని సాధించడం అనేది ఆధునిక భారత రాజకీయాలకు మేలిమలుపు అని పలువురు రాష్ట్ర మంత్రులు అభిప్రాయపడ్డారు. పార్టీ 20వ వార్షికోత్సవం సందర్భంగా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి కేసీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ అడుగుజాడల్లో నడవడం అనేది తమ పూర్వజన్మసుకృతమని హరీశ్రావు పేర్కొన్నారు. అన్ని ఆటుపోట్లను తట్టుకొని ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ సాధించిన వీరుడు సీఎం కేసీఆర్ అని జగదీశ్రెడ్డి కొనియాడారు. మడమ తిప్పని గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని ఈటల రాజేందర్ అభివర్ణించారు. పార్టీని స్థాపించి అహింసా పద్ధతుల్లో మహోద్యామాన్ని నడిపి తెలంగాణ దశాబ్దాలకలను నిజంచేసిన మహానాయకుడు సీఎం కేసీఆర్ అని కొప్పుల ఈశ్వర్ ప్రశంసించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మం త్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పలు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్కు, పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలియజేశారు.