క్యాండీ: కెప్టెన్ దిముత్ కరుణరత్నె (234 బ్యాటింగ్; 25 ఫోర్లు) అజేయ ద్విశతకంతో కదం తొక్కడంతో బంగ్లాదేశ్తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్లో శ్రీలంక 512/3తో నిలిచింది. కరుణరత్నెతో పాటు ధనంజయ డిసిల్వా (154 బ్యాటింగ్; 20 ఫోర్లు) అదరగొట్టాడు. ఓవర్నైట్ స్కోరు 229/3తో శనివారం నాలుగో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన లంక రోజంతా బ్యాటింగ్ చేసి ఒక్క వికెట్ కూడా కోల్పోకపోవడం విశేషం.