న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: దేశంలో ఆక్సిజన్ కొరత, ఆక్సిజన్ను రవాణా చేసే ట్యాంకులు సరిపడా లేకపోవడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి ఆక్సిజన్ రవాణా చేసే సమర్థవంతమైన ట్యాంకులను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా భారత వాయుసేనకు చెందిన సరుకు రవాణా విమానం శనివారం సింగపూర్కు బయలుదేరింది. నాలుగు క్రయోజెనిక్ ట్యాంకులను విమానంలోకి ఎక్కించుకొని తిరిగి భారత్కు చేరింది. పశ్చిమబెంగాల్లోని పనాగఢ్ ఎయిర్బేస్కు చేరిన ఈ విమానం నుంచి ట్యాంకులను కిందకు దించారు. ఈ ట్యాంకులతో ద్రవ ఆక్సిజన్ను సరఫరా చేయనున్నారు.