ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ
జడ్చర్ల టౌన్, ఏప్రిల్ 23: కరోనా బారిన పడకుండా ప్రాణాలతో ఉండాలంటే ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఎంఐఎం జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని పలు వార్డుల్లో ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. తప్పనిసరిగా మాస్కులు ధరించటంతోపాటు నిర్ణీత దూరం పాటించాలని, శానిటైజర్ వాడాలన్నారు.