ఇచ్చోడ, ఏప్రిల్ 23: మండలంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. శుక్రవారం 42 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో 120 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 35 మందికి పాజిటివ్ వచ్చినట్లు హెల్త్ అసిస్టెంట్ రాథోడ్ కైలాస్ తెలిపారు. 45ఏళ్లు దాటిన 24 మందికి టీకా వేసినట్లు పేర్కొన్నారు. అదే వి ధంగా నర్సాపూర్ ప్రభుత్వ దవాఖానలో 25 మందికి పరీక్షలు చేయగా ఏడుగురికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి రాథోడ్ రవి తెలిపారు. పది మందికి టీకాలను వేశామని చెప్పారు.
నేరడిగొండలో 12 మందికి పాజిటివ్
నేరడిగొండ, ఏప్రిల్ 23 : మండల కేంద్రంలోని పీహెచ్సీలో 63 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 12 మందికి పాజిటివ్ వచ్చినట్లు హెచ్ఈవో హరికుమార్గౌడ్ తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మండల ప్రజలు అ ప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
బోథ్లో 31 మందికి..
బోథ్, ఏప్రిల్ 23: మండల వ్యాప్తంగా 31 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్లు ఆర్ రవీంద్రప్రసాద్, కే నవీన్రెడ్డి తెలిపారు. బోథ్ సీహెచ్సీలో 55 మందికి పరీక్షలు చేయగా 25 మందికి, సొనాల పీహెచ్సీలో 52 మందికి పరీక్షలు చేయగా ఆరుగురికి పాజిటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు.
కరోనాతో ఉపాధ్యాయుడు మృతి
బజార్హత్నూర్ మండలం జాతర్ల ఏహెచ్ఎస్లో పని చేస్తున్న ఉపాధ్యాయుడు కరోనాతో మృతి చెందాడు. మూడు రోజుల కిత్రం కరోనా సోకగా ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు.
ఉట్నూర్లో 30 మందికి..
ఉట్నూర్ రూరల్, ఏప్రిల్ 23: మండలంలో శుక్రవారం 238 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 30 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో 59 మందికి పరీక్షలు చేయగా ఇద్దరికి, దంతన్పెల్లి పీహెచ్సీలో 100 మందికి పరీక్షలు చేయగా 22 మందికి, శ్యాంపూర్ పీహెచ్సీలో 43 మందికి పరీక్షించగా ఎనిమిది మందికి పాజిటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు.
ఇంద్రవెల్లిలో నలుగురికి..
ఇంద్రవెల్లి, ఏప్రిల్ 23: మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో 32 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా నలుగురికి పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారు హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు. సీహెచ్వో రాథోడ్ బాబులాల్, వైద్యసిబ్బంది జాదవ్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
కర్ఫ్యూ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు : రాచకొండ సీపీ