వనపర్తి, ఏప్రిల్ 22 : కరోనా సెకండ్వేవ్తో ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్ కోరారు. గురువారం జిల్లా దవాఖానలో ఆయన కొవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్ను వేయించుకున్నారు. ఈ సందర్భ ంగా మాట్లాడుతూ 45 ఏండ్లు దాటిన ప్రతి ఒక్కరూ విధిగా టీకా వేయించుకోవాలన్నారు. ప్రతిఒక్కరూ మాస్కు ధరించడంతోపాటు విధిగా భౌతికదూరాన్ని పాటించాలన్నారు.
69 మందికి వ్యాక్సినేషన్
పాన్గల్, ఏప్రిల్ 22 : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో గురువారం 69మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు మండల వైద్యాధికారి వంశీకృష్ణ తెలిపారు. మొత్తం 53 మందికి కొవిడ్ ర్యాపిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా 17 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. 45 ఏండ్లు పైబడిన వారు వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు.
135 మందికి కొవిడ్ వ్యాక్సిన్
గోపాల్పేట, ఏప్రిల్ 22 : మండలంలోని ప్రాథమిక ఆరో గ్య కేంద్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. గురువారం 135 మందికి కొవిడ్ వ్యాక్సిన్ వేసినట్లు మండల వైద్యాధికారి మంజుల తెలిపారు. 50 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా 18 మందికి పాజిటివ్ వచ్చినట్లు ఆమె తెలిపారు. కొవిడ్ బారిన పడకుండా ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
కొనసాగుతున్న వ్యాక్సినేషన్
కొత్తకోట, ఏప్రిల్ 22 : కొత్తకోట, అప్పరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొవిడ్ వ్యాక్సిన్ను వేస్తున్నారు. ప్రతి ఒక్కరూ టీకా వేసుకొని ధైర్యంగా ఉండాలన్నారు. ప్రభు త్వం 45 ఏండ్లు పైబడిన వారికి కొవిడ్ వ్యాక్సిన్ టీకాను ఉచితంగా అందిస్తుందని, తప్పకుండా వ్యాక్సిన్ను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థి విభాగం నాయకులు శ్రీనుజీ కోరారు.
టీకా పంపిణీ
శ్రీరంగాపూర్, ఏప్రిల్ 22 : కరోనా వ్యాధి నివారణకు ప్రభుత్వం అందిస్తున్న వ్యాక్సిన్ను అర్హులైన ప్రతిఒక్కరూ తప్పకుండా వేయించుకోవాలని ఎంపీపీ గాయత్రి పిలుపునిచ్చారు. మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. ప్రజలు కరోనా వ్యాధికి భయబ్రాంతులకు గురి కాకుండా తప్పనిసరిగా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన వారిలో జెడ్పీటీసీ రాజేంద్రప్రసాద్, సింగిల్ విండో డైరెక్టర్ అనంద్ రాజు, టీఆర్ఎస్ నాయకులు పృథ్వీరాజు, వెంకటస్వామి ఉన్నారు.