హైదరాబాద్ : తెలంగాణలో ఓ వైపు ఎండలు మండుతుండగా.. మరో వైపు అక్కడక్కడ వానలు కురుస్తున్నాయి. సోమవారం గ్రేటర్ హైదరాబాద్లో పలుచోట్ల ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షం పడింది. నైరుతి మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల నుంచి మరాఠ్వాడ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 21 వరకు ఒకటి రెండు ప్రదేశాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నది. ఒకటి రెండుచోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నెల 21 వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2, 3 డిగ్రీలు పెరుగవచ్చని తెలిపింది. సోమవారం రాష్ట్రంలో 20 ప్రాంతాల్లో 42.3 నుంచి 43.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు టీఎస్డీపీఎస్ పేర్కొంది.
ఢిల్లీ స్కూల్స్కు రేపటి నుంచి జూన్ 9 వరకు వేసవి సెలవులు
సీఎం కేసీఆర్కు కరోనా.. త్వరగా కోలుకుంటారని కేటీఆర్ ట్వీట్
భారత్ను ట్రావెల్ రెడ్ లిస్ట్ జాబితాలో చేర్చిన బ్రిటన్