లింగాల, ఏప్రిల్ 19: రెండో దశ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నందున మండలంలోని అంబట్పల్లి సర్పంచ్ రవిశంకర్ ఆధ్వర్యంలో గ్రామస్తులు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున 5రోజుల పాటు గ్రామస్తుల సహకారంతో లాక్డౌన్ విధిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 7 నుంచి 9గంటల వరకు నిత్యావసర సరుకులు తీసుకోవడానికి దుకాణాలకు అనుమతిచ్చిన్నట్లు తెలిపారు. అనంతరం దుకాణాలను మూసివేయాలన్నారు. ప్రజలు అత్యవసర సమయంలో బయటికొస్తే మాస్కులు ధరించాలన్నారు. మాస్కులు లేకుండా వస్తే రూ.1000 జరిమానా విధిస్తామన్నారు. కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
ఇవి కూడా చదవండి
సలార్ లో శృతిహాసన్ రోల్ ఏంటో తెలిసిపోయింది
మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన అందరికీ కరోనా వ్యాక్సిన్