అమరావతి : కొవిడ్ ఉధృతి తీవ్రంగా పెరుగుతుండటంతో మొదటగా హెల్త్కేర్ వర్కర్స్కు అదేవిధంగా ఫ్రంట్లైన్ వర్కర్స్కి వ్యాక్సిన్ వేసేందుకు ఏపీ ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ను నిర్వహించనుంది. సీఎం వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి సూచనల మేరకు చర్యలు చేపట్టినట్లు ఆ రాష్ట్ర కొవిడ్ నోడల్ ఆఫీసర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు. శనివారం అందిన ఆరు లక్షల డోసులతో పాటు ఆదివారం మరో రెండు లక్షల కోవిషీల్డ్ డోసులు ఏపీకి చేరుకున్నాయి.
మిగిలిన ఫ్రంట్లైన్, హెల్త్కేర్ వర్కర్లకు కొవిడ్ టీకాలు వేసే డ్రైవ్ను చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మొత్తం 10 లక్షల మంది వర్కర్స్లో ఇప్పటివరకు 5 లక్షల మందికి టీకాలు వేసినట్లు శ్రీకాంత్ వెల్లడించారు. లబ్ధిదారులకు టీకాలు వేసేలా చూసేందుకు వ్యక్తిగత టీకా డేటాను పర్యవేక్షించే ఓ అప్లికేషన్ను అభివృద్ధి చేసినట్లు చెప్పారు.