మాస్కు లేకపోతే జరిమానా
ఎస్సై రాములు
మక్తల్ రూరల్, ఏప్రిల్ 16 : కరోనా వైరస్ కారణంగా ఇతర రాష్ర్టాలకు వలస వెళ్లిన కార్మికులు తిరిగి స్వస్థలాలకు వస్తున్నారని, గ్రామాలకు ఎవరైనా వలస కార్మికులు వస్తే అధికారులకు ముందస్తు సమాచారం ఇవ్వాల ని ఎస్సై రాములు కోరారు. మండలంలో మాస్కులు లేనివారికి శుక్రవా రం ఈ చలాన్ ద్వారా జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ ముగిసిన తర్వాత మహారాష్ట్రలో మళ్లీ కరోనా వైర స్ విజృంభిస్తున్న కారణంగా ముంబయి, పుణె, అమరనాథ్, షోలాపూర్ వంటి పట్టణాలకు ఈ ప్రాంతం నుంచి బతుకుదెరువు కోసం వలస వెళ్లిన కార్మికులు రెండు రోజుల నుంచి మక్తల్ ప్రాంతానికి తిరిగి వస్తున్నట్లు ఎస్సై తెలిపారు. జిల్లాలో కూడా కరోనా కేసులు పెరుగుతుండడం వల్ల ప్రజలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి వచ్చిన వలస కార్మికులు నేరుగా గ్రామాలకు వస్తే కే సులు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.
మండలంలోని పరిసర గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు, ఆశ కా ర్యకర్తలు చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా విషయంలో ఎవరు కూడా నిర్లక్ష్యం చేయరాదన్నారు. వలస కార్మికులు ముందుగా సమాచారం ఇచ్చి గ్రామాల్లో పీహెచ్సీ కేంద్రాల్లో కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతిఒక్కరూ కొవిడ్-19 నిబంధనలు పాటించాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, శానిటైజర్లు ఉపయోగించాలని, ఎవరైనా మాస్కులు లేకుండా బయట తిరిగితే జరిమానా విధించాల్సి వస్తుందని ఎస్సై హెచ్చరించారు. కరోనా వైరస్ నియంత్రణకు ప్రతిఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది తది తరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
సతీష్ రెడ్డిని పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి
టీఆర్ఎస్లోకి వెల్లువలా చేరికలు