కోల్కతా : దీదీ ముఖంలో ఓటమి ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఓటమి భయంతో బెంగాల్లో హింసను ప్రేరేపిస్తూ రిగ్గింగ్కు పాల్పడుతున్నారని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నదియాలో శనివారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మోదీ మాట్లాడుతూ బీజేపీ కార్యకర్తలను పొట్టనపెట్టుకుని రిగ్గింగ్కు పాల్పడటంలో తృణమూల్ కాంగ్రెస్కు నైపుణ్యం ఉందని ఎద్దేవా చేశారు.
మైనారిటీలు దూరమవడంతో వారి ఓట్ల కోసం దీదీ పాకులాడుతున్నారని ఆరోపించారు. ప్రజలు తనపట్ల విశ్వాసం కోల్పోడంతో ఆమె బెంబేలెత్తుతున్నారని వ్యాఖ్యానించారు. మరోవైపు కూచ్బెహర్ జిల్లాలోని ఓ పోలింగ్ బూత్ వద్ద కేంద్ర బలగాల కాల్పుల్లో ఐదుగురు మరణించిన ఘటనపై దీదీ మోదీ సర్కార్పై విరుచుకుపడ్డారు. ఓటర్లను భయపెట్టేందుకే కేంద్ర హోంమంత్రి కుట్రలో భాగంగా కాల్పులు జరిపారని విమర్శించారు.