మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 5: ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ తప్పడని టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, మున్సిపల్ కౌన్సిలర్ కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాయంలో విలేకరులతో మాట్లాడా రు. రాష్ట్రంలోని రజకుల దోబీఘాట్లు, లాండ్రీలకు, నాయీబ్రాహ్మణులకు సంబంధించిన క్షౌరశాలలకు ఉచి త కరెంట్ ఇస్తామని ఇంతకుముందే చెప్పారని ఇచ్చిన మాటను కేసీఆర్ ఏనాడు తప్పడని అన్నారు. రజకులు, నాయీబ్రాహ్మణులకు ఉచితంగా 250 యూనిట్ల వరకు విద్యుత్ అందజేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు అరవింద్గౌడ్, రుక్మల్చారి, టీఆర్ఎస్వీ జిల్లా నాయకుడు నవీన్ పాల్గొన్నారు.
నాయీబ్రాహ్మణులు రుణపడి ఉంటారు
క్షౌరశాలలకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందించేందుకు ఉత్తర్వులు జారీచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు నాయీబ్రాహ్మణులు ఎల్లకాలం రుణపడి ఉంటారని నాయీబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు చింత అడివయ్య పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తాలో నాయీబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యం లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అడివయ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలో 80వేల క్షౌరశాలలకు లబ్ధి చేకూరుతుందన్నారు. కరోనా నేపథ్యంలో గత సంవత్సర కాలం నుంచి నాయీబ్రాహ్మణులు ఆర్థికంగా చితికిపోయారన్నారు. కరెంట్ బిల్లులు చెల్లించలేక నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. పట్టణ నాయీబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు మాణిక్దాస్ ఉన్నారు.