ముంబై : తల్లి టీవీ ఆఫ్ చేసిందన్న కోపంతో కుమారుడు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా కేజ్ తాహసిల్ పరిధిలోని వకిల్వాడి ప్రాంతంలో ఆదివారం ఉదయం ఈ విషాద ఘటన జరిగింది.
వకిల్వాడి ప్రాంతానికి చెందిన బాలుడు (19) స్థానికంగా ఓ పాఠశాలలో చదువుతున్నాడు. ఆన్లైన్ క్లాసులు ముగియగానే ఇంట్లో నేలపై పడుకొని టీవీ చూస్తున్నాడు.
సరిగ్గా కూర్చొని టీవీ చూడాలంటూ తల్లి టీవీని ఆఫ్ చేసింది. దీంతో తీవ్ర మనోవేదనకు లోనైన బాలుడు స్నానాల గదిలోకి వెళ్లి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కాసేపటి తల్లి, సోదరి విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కేజ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి